Tuesday 27 November 2012

‘గబ్బర్ సింగ్' చిత్రం 200 రోజులు



హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం 200 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రం 5 సెంటర్లలో రెండు వందల రోజులు పూర్తి చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే నిర్మాతలు మాత్రం ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.
గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘దబాంగ్' చిత్రానికి ఇది రీమేక్. 2012లో ఈచిత్రం బిగ్గెస్ హిట్ చిత్రంగా నిలవడమే కాదు....టాలీవుడ్ చరిత్రలో పలు సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
gabbar singh 200 days
గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్ రూపొందబోతోందనే ప్రచారం ఇటీవల జరిగినా....ఇప్పటి వరకు అలాంటి ఆలోచన ఏమీ లేదని దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవలే ప్రకటించారు. నేను గానీ, నిర్మాత బండ్ల గణేష్ గానీ ఎప్పుడూ గబ్బర్ సింగ్-2 గురించి మాట్లాడుకోలేదు. ఏదైనా పవర్ స్టారే డిసైడ్ చేస్తారు' అంటూ ట్వీట్ చేసాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘సరదా'(తాత్కాలిక టైటిల్) చేయడానికి రెడీ వుతున్నారు. ఈచిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం ఫిల్మ్ నగర్లోని ఓ దేవాలయంలో ఇటీవల జరిగింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో పవన్ సరసన సమంత హీరోయిన్ గా ఎంపికైంది.

రామ్ చరణ్ @‘జంజీర్’ సెట్స్‌ (ఫోటో ఫీచర్)



హైదరాబాద్ లో చివరి రోజు షూటింగ్ ముగిసిన అనంతరం ఫోటోలకు ఫోజు ఇచ్చిన యూనిట్ సభ్యులు
ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో కొంత షూటింగ్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి కూడా ముఖ్య పాత్రలు పోస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన‘జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చెర్రీకి కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు.


దర్శకుడు అపూర్వ లఖియాతో చరణ్, ప్రియాంక
ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో కొంత షూటింగ్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి కూడా ముఖ్య పాత్రలు పోస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన‘జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చెర్రీకి కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Wednesday 24 October 2012

Pawan kalyan 'CGR' Six Days AP Shares

'CGR' Six Days AP Shares


'CGR' Six Days AP Shares

Power Star Pawan Kalyan's 'cameraman gangatho rambabu'
 collected a share of Rs.20.69 crores at the end of its six days 
run in AP only. Given below are the are the area wise break up of shares.
AREA                               SIX DAYS AP SHARES( IN CRORES)
------------------     -------------------------------------------------------
NIZAM                                         7.34
CEDED                                         3.84
NELLORE                                      0.90
KRISHNA                                      1.40
GUNTUR                                       2.23
VIZAG                                          2.12
EAST GODAVARI                            1.46
WEST GODAVARI                           1.40  
SIX DAYS AP SHARE                         20.69

 

అల్లు అరవింద్ 'గీతా ఆర్ట్స్‌' నెక్ట్స్ చిత్రం ఖరారు


హైదరాబాద్ : పరిశ్రమలో అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్‌ సంస్థ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు. ఈ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలు మెగా హిట్స్ అయ్యాయి. అయితే తమ సొంత కుటుంబ హీరోలతోనే ఈ బ్యానర్ లో సినిమాలు చేస్తూంటారు. తాజాగా ఈ బ్యానర్ పై మరో చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి మేనల్లుడు సాయిధర్మతేజ్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది‌. ఇతనితో గీతా ఆర్ట్స్‌ సంస్థ ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ నిర్మించబోతోంది
గతంలో గోపీచంద్ తో 'యజ్ఞం' చిత్రం రూపొందించిన ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహిస్తారు. అల్లు అరవింద్‌, దిల్‌ రాజు నిర్మాతలు. వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. నిర్మాతలు మాట్లాడుతూ ''వినోదంతో పాటు యువతరానికి నచ్చే అంశాలు ఉన్న కథ ఇది. శ్రీహరి ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. అనూప్‌ రూబెన్స్‌ ఈ చిత్రానికి స్వరకర్త'' అన్నారు. సాయిధర్మతేజ్‌కిది రెండో చిత్రం. ప్రస్తుతం వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో 'రేయ్‌'లో నటిస్తున్నారు.
.ప్రస్తుతం ‘రేయ్' చిత్రం ఫైనల్ స్టేజిలో ఉంది. ట్రినిడాడ్-టొబాగోల్లో షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర యూనిట్ తర్వాతి పోర్షన్ పూర్తి చేయడానికి లాస్ వెగాస్ బయల్దేరి వెళ్లారు. ఈ చిత్రం ద్వారా సయామీ ఖేర్ అనే భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అదే విధంగా హీరోయిన్ శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో పర్మినెంట్ రోల్ పోషిస్తోంది.
వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి చక్రి సంగీతం అందిస్తుండగా, గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 2013లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సినిమాపై అంచనాలు పెంచేందుకు ఈచిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లను సంబంధించిన విషయాలు పొందు పరుస్తున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్, సురేంద్రరెడ్డి చిత్రం టైటిల్

Allu Arjun New Movie Race Gurram

హైదరాబాద్ : అల్లు అర్జున్, సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో కొత్త చిత్రం విజయదసమి రోజున( అక్టోబర్ 24)న ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'రేసు గుర్రం' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నల్లమలుపు బుజ్జి నిర్మించే ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైంది. లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ లాంచింగ్ సెర్మనీకి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. వివి వినాయిక్ తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. చిరంజీవి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా రచయిత వక్కంతం వంశీ మాట్లాడుతూ... అల్లు అర్జున్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో పనిచేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. పూర్తి స్ధాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది అన్నారు.
సహ నిర్మాత డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...బన్నీతో కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతుంది అన్నారు. ఈ లాంచింగ్ పంక్షన్ లో సినీ ప్రముఖులు అల్లు అరవింద్,నాగబాబు,డి రామానాయుడు, కె రాఘవేంద్రరావు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అల్లు అర్జున్, వక్కంతం వంశీ తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పూరీ జగన్నాధ్ ‘ఇద్దరమ్మాయిలతో' టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు .‘ఇద్దరమ్మాయిలతో' అనే సినిమా టైటిల్ ట్రేడ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎప్పుడూ వెరైటీ టైటిల్స్‌తో సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి స్క్ర్రిప్టుని డిఫెరెంట్ గా పూర్తి స్ధాయి వినోదం తో సమకూర్చినట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి ‘దేశముదురు' సినిమా చేశారు. అది అర్జున్‌కు మాస్ ఇమేజ్‌ను పెంచింది. ఈ చిత్రం గురించి పూరి జగన్నాథ్ తెలియజేస్తూ "ఈ కథ విని బన్ని ఎంతో ఎగ్జయిట్ అయ్యాడు. ఇద్దరమ్మాయిలతో బన్ని చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. మా కాంబినేషన్‌లో మరో విభిన్న చిత్రంగా ఇది రూపొందనుంది'' అని చెప్పారు.

Allu Arjun New Movie Opening stylls

pawan kalyan 'CGR' Six Days AP Shares


youtube lo Pawan Rambabu Cuts


Rambabu Record collections


Rambabu collections







rambabu_ki_fre_pablicitee_2kotlu.html

Allu arjun new movie Resu gurram


allu_arjun_race_gurram.html