Tuesday 27 November 2012

‘గబ్బర్ సింగ్' చిత్రం 200 రోజులు



హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం 200 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రం 5 సెంటర్లలో రెండు వందల రోజులు పూర్తి చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే నిర్మాతలు మాత్రం ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.
గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘దబాంగ్' చిత్రానికి ఇది రీమేక్. 2012లో ఈచిత్రం బిగ్గెస్ హిట్ చిత్రంగా నిలవడమే కాదు....టాలీవుడ్ చరిత్రలో పలు సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
gabbar singh 200 days
గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్ రూపొందబోతోందనే ప్రచారం ఇటీవల జరిగినా....ఇప్పటి వరకు అలాంటి ఆలోచన ఏమీ లేదని దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవలే ప్రకటించారు. నేను గానీ, నిర్మాత బండ్ల గణేష్ గానీ ఎప్పుడూ గబ్బర్ సింగ్-2 గురించి మాట్లాడుకోలేదు. ఏదైనా పవర్ స్టారే డిసైడ్ చేస్తారు' అంటూ ట్వీట్ చేసాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘సరదా'(తాత్కాలిక టైటిల్) చేయడానికి రెడీ వుతున్నారు. ఈచిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం ఫిల్మ్ నగర్లోని ఓ దేవాలయంలో ఇటీవల జరిగింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో పవన్ సరసన సమంత హీరోయిన్ గా ఎంపికైంది.

రామ్ చరణ్ @‘జంజీర్’ సెట్స్‌ (ఫోటో ఫీచర్)



హైదరాబాద్ లో చివరి రోజు షూటింగ్ ముగిసిన అనంతరం ఫోటోలకు ఫోజు ఇచ్చిన యూనిట్ సభ్యులు
ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో కొంత షూటింగ్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి కూడా ముఖ్య పాత్రలు పోస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన‘జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చెర్రీకి కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు.


దర్శకుడు అపూర్వ లఖియాతో చరణ్, ప్రియాంక
ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో కొంత షూటింగ్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి కూడా ముఖ్య పాత్రలు పోస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన‘జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చెర్రీకి కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు.